News February 22, 2026

ఆసిఫాబాద్: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

image

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. కెరమెరి ఎస్ఐ మధుకర్ కథనం ప్రకారం.. కెరిమెరికి చెందిన గుర్నాలే వార్లు(74) బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపునకు వెళ్తున్న ఆయను, వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News February 24, 2026

జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

image

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 24, 2026

అవన్నీ ఫేక్.. తన రెండో పెళ్లిపై వస్తున్న రూమర్లకు ధవన్ చెక్!

image

రెండో పెళ్లి తర్వాత తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని శిఖర్ ధవన్ ఖండించారు. ‘నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని నా మాజీ భార్య శాపనార్థాలు పెట్టిందని, దానికి బదులుగానే మళ్లీ మ్యారేజ్ చేసుకున్నానని’ SMలో వస్తున్న రూమర్స్‌లో నిజం లేదని ధవన్ స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని, తానెప్పుడూ పాజిటివిటీని కోరుకుంటానన్నారు. సోఫీ షైన్‌తో తన కొత్త లైఫ్‌ను సంతోషంగా మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

News February 24, 2026

ఇంట్లో గవ్వలు ఎందుకు ఉండాలి?

image

గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్రం నుంచి ఉద్భవించిన వీటిని లక్ష్మీదేవికి తోబుట్టువుగా చెబుతారు. ఇవి ఇంట్లో ఉంటే మహాలక్ష్మి కటాక్షం కలిగి, ఆర్థిక ఇబ్బందులు పోతాయని పండితులు చెబుతున్నారు. ‘పసుపు రంగు గవ్వలు పూజా గదిలో, గల్లా పెట్టెలో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. గవ్వలకు ప్రతికూల శక్తిని హరించే గుణం ఉంది. అందుకే ఇంటి గుమ్మానికి గవ్వల తోరణం కట్టాలి. దిష్టి దోషాలు పోతాయి’ అంటున్నారు.