News March 5, 2025

ఆసిఫాబాద్‌: పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను తనిఖీ చేసిన ఆయన పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని 19 పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 అమలులో ఉందని తెలిపారు.

Similar News

News July 5, 2025

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 5, 2025

విద్యా కిట్లు వెంటనే అందించాలి: పద్మశ్రీ

image

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం, అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ అన్నారు. శనివారం ఏలూరులో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా కిట్ల పంపిణీ కొన్ని మండలాల్లో ఆలస్యం అయినట్లు గుర్తించామన్నారు. కిట్స్ వెంటనే అందించాలన్నారు.

News July 5, 2025

శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్

image

టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా అవతరించారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.