News November 16, 2025

ఆసిఫాబాద్: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 842 కేసులు పరిష్కారం

image

కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ రమేష్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్‌లోని న్యాయస్థానంలో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వివిధ కోర్టుల్లోని 842 కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

లంచ్: 10కే 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా తడబడుతోంది. లంచ్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 10 రన్స్ చేసింది. భారత్ విజయానికి మరో 114 రన్స్ అవసరం. క్రీజులో సుందర్, జురేల్ ఉన్నారు. జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు.

News November 16, 2025

పెరుగుతో అందం పెంచేయండి..

image

చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు పరిష్కారం చూపుతుంది. * అరటిపండు, తెల్లసొన, శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాయాలి. దీనివల్ల మోము మృదువుగా మారుతుంది. * పెరుగు, మెంతి పొడి, బాదం నూనె, గులాబీ నీళ్లు కలిపి ముఖానికి పూతలా వేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఓట్స్ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేసి మృత కణాలు, మురికినీ తొలగిస్తాయి.

News November 16, 2025

మల్లెమడుగు రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

తిరుపతి తాతయ్యగుంటకు చెందిన శేఖర్ (32), శివ (35), నరేష్ (36) ముగ్గురు రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌కు ఈతకోసం వెళ్లారు. ఉదయం 9 గంటలకు నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతుండగా, కాపాడేందుకు దూసుకెళ్లిన నరేష్ కూడా మునిగిపోయాడు. శేఖర్ రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.