News January 29, 2025
ఆసిఫాబాద్ మెడికల్ షాపుల్లో బినామీ వ్యక్తుల హవా?

ఆసిఫాబాద్ జిల్లాలో మందుల షాపులను బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
NGKL: ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

సెప్టెంబర్ 17న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా పాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు ఎస్పీ కార్యాలయం, 9:50 గంటలకు కలెక్టర్ కార్యాలయంపై జాతీయ జెండా ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరవుతారని తెలిపారు.
News September 16, 2025
సంగారెడ్డి: ‘ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఈనెల 17వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఆదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ పద్మజారాణి, డీఎస్పీ సత్తయ్య గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
జగిత్యాల: యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లకు ప్రోసీడింగ్లు అందజేత

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రోసీడింగ్లను అందజేశారు. ఇటీవల జగిత్యాల పట్టణం, పలు మండలాలకు కొత్తగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఆయన ఈ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.