News October 31, 2025

ఆసిఫాబాద్: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైతు ఆత్మహత్య

image

చేతికి వచ్చిన పంట తుపాన్ ప్రభావంతో నష్టపోయిందని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. లింగాపూర్(M ) సీతారాంనాయక్ తండాలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు బలిరామ్(59) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మొక్కజొన్న పంట దెబ్బతినడంతో పురుగుమందు తాగాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News November 1, 2025

TODAY HEADLINES

image

*TG: మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
*నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు: సీఎం రేవంత్
*420 హామీలతో ప్రజలను మోసం చేశారు: KTR
*గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN
*₹5,244Cr నష్టం.. తక్షణమే సాయం చేయాలని కేంద్రానికి ఏపీ నివేదిక
*AP: ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ
*రెండో టీ20లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
*ప్రో కబడ్డీ లీగ్ విజేత దబాంగ్ ఢిల్లీ

News November 1, 2025

IBM సహకారంతో నేషనల్ ‘AI LAB’

image

విద్యార్థులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో తీర్చిదిద్దడంలో మరో ముందడుగు పడింది. ‘నేషనల్ AI ల్యాబ్’ ఏర్పాటుకు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ IBM, AICTE వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఢిల్లీలో ఏర్పాటుకానున్న ల్యాబ్ పరిశోధన, నైపుణ్యం, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలువనుంది. 1000కి పైగా కోర్సుల ద్వారా 30M మందికి AI పరిజ్ఞానం అందనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తదుపరి తరాన్ని అందించడంలో ఇది దోహదపడనుంది.

News November 1, 2025

భీమారం: రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

image

భీమారం మండలం కేంద్రంలో తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.