News October 13, 2024
ఆసిఫాబాద్: ‘లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి’
కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.
Similar News
News October 13, 2024
కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
News October 13, 2024
ADB: ఎంబీబీఎస్లో సీటు.. విద్యార్థికి రూ.50 వేల సాయం
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.
News October 12, 2024
నిర్మల్: పండగపూట విషాదం
దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత్ పేట్కు చెందిన పోలీస్ బొర్రన్న (50)మృతి చెందాడు. దిలావర్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతణ్ని 108లో నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు.