News January 10, 2026
ఆసిఫాబాద్: సెలవుల్లో జాగ్రత్త.. పిల్లలపై ఓ కన్నేయండి

ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు విద్యార్థులు ఇంట్లోనే ఉండనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు సూచించారు. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజా వాడకుండా చూడాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని కోరారు. అలాగే పిల్లలు ద్విచక్ర వాహనాలతో రోడ్లపైకి రాకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.
Similar News
News February 11, 2026
VZM: చెరువులో పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా బాడంగి మండలం రావివలసలోని అప్పలనాయుడు చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు స్థానిక గ్రామానికి చెందిన అప్పచ్చిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం చెరువు వద్దకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 11, 2026
సంగారెడ్డి: 9 గంటలకు 13.19% పోలింగ్

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలో ఉదయం 9 గంటలకు 13.19 శాతం పోలింగ్ నమోదైంది. ఆందోలు జోగిపేట- 14.13, గడ్డపోతారం-15.47, గుమ్మడిదల- 12.40, ఇంద్రేశం- 13.30, జిన్నారం 12.57,కొహీర్- 16.52, ఇస్నాపూర్- 17.13, నారాయణఖేడ్- 11.10, సదాశివపేట- 15.68, సంగారెడ్డి 6.94, జహీరాబాద్ 16.64% శాతం పోలింగ్ నమోదయింది.
News February 11, 2026
తిరుమల: లీవ్ పెట్టారా.. పెట్టించారా?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో ఓ.బాలాజీ ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. చర్యలకు సిఫార్సు చేసింది. అయితే ఆయన సెలవుపై వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో సెలవు పెట్టారని కొందరి వాదన. చర్యలు తీసుకునే ముందు ఆయనను సెలవు పెట్టించారనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చూడాలి మరి.


