News December 28, 2025
ఆ అధికారుల చొరవతో గుంటూరు జిల్లా శుభిక్షం

2025లో గుంటూరు జిల్లా వరుస తుఫాన్లు, ప్రమాదాలు, ప్రకృతి వపత్తులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
సమర్థవంతమైన పాలనతో వాటి నుంచి జిల్లాను సురక్షితంగా నడిపించిన నలుగురు అధికారుల పాత్ర కీలకంగా నిలిచింది. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి, SP సతీష్ కుమార్తో పాటు ప్రస్తుత కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP వకుల్ జిందల్ సమన్వయంతో తీసుకున్న చర్యలతో జిల్లా శుభిక్షంగా ఉందని ప్రజలు అంటున్నారు.
Similar News
News December 31, 2025
GNT: SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి

గుంటూరు జిల్లా SC,ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కంతేటి బ్రహ్మయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కమిటీకి సభ్యుడుగా నియమించిన గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం 1989లో ఏర్పాటు చేసిన చట్టాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
News December 31, 2025
గుంటూరులో పడిపోయిన గాలి నాణ్యత

గుంటూరులో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మంగళవారం AQI.in నివేదిక ప్రకారం, నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 229గా నమోదైంది. ఇది ‘సివియర్’ కేటగిరీ కిందకు వస్తుంది. గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాలైన తెనాలి, బాపట్ల వైపు కూడా కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో AQI 212 నుంచి 243 మధ్య నమోదైంది. చలి తీవ్రత పెరగడం, వాహనాల కాలుష్యం కారణంగా గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
News December 31, 2025
అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ సీఎం చంద్రబాబు పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. ఉత్తరాది భక్తులు ఆయనను ‘హైటెక్ సిటీ సీఎం’గా, మోదీ మిత్రుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, ధర్మం అనే రెండు చక్రాలపై ఆయన రాజకీయం సాగుతోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ‘రామరాజ్యమే పాలనకు ప్రామాణికం’ అని బాబు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.


