News June 28, 2024
ఆ ఘటనలపై నివేదిక ఇవ్వండి: మంత్రి పయ్యావుల

గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ నివేదిక కోరారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత తాగునీరు, కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అలాగే ఉరవకొండ మండలం చిన్న ముస్టూరులో నాగేంద్ర అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన ఘటనపై కూడా నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను మంత్రి కోరారు.
Similar News
News November 10, 2025
జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News November 9, 2025
అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.
News November 8, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.


