News December 20, 2025

ఆ వాహనాలు ఎవరికోసమో….?

image

తిరుపతి డివిజన్‌లో డిసెంబర్‌ 20న సీజ్ చేసిన వాహనాల వేలం నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో మొత్తం 375 వాహనాలకు టెండర్లకు ఆహ్వానం ఇచ్చినా 305 వాహనాలకే టెండర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 70 వాహనాల వివరాలను రౌండప్ చేసి, వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వేలంలో పాల్గొనే వారిలో తీవ్ర అయోమయం నెలకొంది. ఆ వాహనాలు ఎందుకు పక్కనబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.

Similar News

News December 24, 2025

మెరుపు డెలివరీ వెనుక మైండ్ గేమ్!

image

క్విక్ కామర్స్ సంస్థలు మెరుపు వేగంతో డెలివరీ చేస్తూ ప్రజల జీవనశైలిని మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా అనలిటిక్స్‌ టెక్నాలజీని వాడి ఈ యాప్స్ మీ అవసరాలను ముందే అంచనా వేస్తాయి. ఆర్డర్ చేయగానే ‘డార్క్ స్టోర్స్‌’లో సిద్ధంగా ఉన్న వస్తువులను ప్యాక్ చేసి 10ని.ల్లో డెలివరీ చేస్తాయి. వీటివల్ల ప్రజల్లో ఓపిక తగ్గిపోవడంతో పాటు వస్తువులను నిల్వ చేసుకునే ప్రణాళికాబద్ధమైన అలవాటు కనుమరుగవుతోంది.

News December 24, 2025

VHT: భారీ విజయం.. 397 పరుగుల తేడాతో

image

VHTలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో బిహార్ 397 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ వైభవ్, ఆయుశ్, గనిల శతకాల విధ్వంసంతో 50 ఓవర్లలో <<18657571>>574<<>> రన్స్ చేసింది. ఛేదనలో అరుణాచల్ 177 పరుగులకే ఆలౌటైంది. దీంతో VHT చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం నమోదైంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌పైనే తమిళనాడు 435 రన్స్ తేడాతో గెలిచింది.

News December 24, 2025

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు: రేవంత్

image

TG: నీటి ప్రాజెక్టుల అంశంలో KCRకు CM రేవంత్ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం. కానీ KCR పాలనలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరును ఎండబెట్టారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీగా, తర్వాత సీఎం అయ్యారు. కానీ పాలమూరుకు నీళ్లు రాలేదు. పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు’ అని కొడంగల్ సభలో ఆరోపించారు.