News November 4, 2025
ఆ వ్యర్థాలను సాధారణ చెత్తలో వేయొద్దు: ఆదిలాబాద్ కలెక్టర్

ఆసుపత్రులు, వెటర్నరీ హాస్పిటల్స్, పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే మానవ, రసాయన వ్యర్థాలను సాధారణ చెత్తలో వేయొద్దని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో బయో మెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 అమలుపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.
Similar News
News November 4, 2025
ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.
News November 4, 2025
ఆదిలాబాద్: ‘బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేం’

ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఏళ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు పంచాయతీ రాజ్ ఎస్ఈ జాదవ్ ప్రకాశ్కు వినతిపత్రం అందజేశారు. బిల్లులు రాకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని, మిగిలిన పనులు చేయలేని పరిస్థితి ఉందని వివరించారు.
News November 4, 2025
మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి: ఆదిలాబాద్ ఎస్పీ

మహిళలు, విద్యార్థినుల రక్షణ, భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో “పోలీస్ అక్క” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల,కళాశాలను మహిళ పోలీసు సందర్శించాలని సూచించారు. పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


