News August 12, 2025

ఆ సర్వేతో ఒంగోలుకు రూ.50కోట్లు: కమిషనర్

image

ఒంగోలు నగరంలో నక్ష సర్వేను 30 రోజుల్లో సచివాలయాల సెక్రటరీలు పూర్తి చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో నక్ష సర్వే తీరుపై కమిషనర్ సమీక్షించారు. ఈ సర్వే పూర్తి చేసిన వెంటనే నగరపాలక సంస్థకు కేంద్రం రూ.50 కోట్ల ప్రోత్సాహకంగా అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి సిబ్బంది పక్కాగా పనిచేయాలని కోరారు.

Similar News

News August 13, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్‌కు మంత్రి స్వామి ఫోన్..!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.

News August 13, 2025

జిల్లాలో జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కమర్షియల్ టాక్స్ శాఖ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 40 లక్షలు, రూ. 20 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. పన్ను లేకుండా సరుకుల రవాణా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News August 13, 2025

సంతనూతలపాడు: ఆటో బోల్తా.. మహిళ మృతి

image

సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద బుధవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పెండ్ర కోటమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.