News March 20, 2026
ఆ 22 నౌకలొస్తేనే..

పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవలే శివాలిక్, నందాదేవి నౌకలు LPGతో భారత్ చేరుకోవడంతో స్వల్ప ఉపశమనం లభించింది. కానీ మరో 22 షిప్లు <<19422225>>హార్ముజ్<<>> వద్దే నిలిచిపోయాయి. ఈ నౌకలే భారత ఇంధన భద్రతకు కీలకం. వీటిని హార్ముజ్ దాటించడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నౌకల రాక ఆలస్యమైనా, చాలాకాలం అక్కడే చిక్కుకుపోయినా దేశంలో గ్యాస్ కొరత మరింత తీవ్రమయ్యే ఆస్కారముంది.
Similar News
News March 30, 2026
రుచికి, ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. ఇడ్లీ!

ఏటా మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ జరుపుకుంటారు. దక్షిణ భారతీయుల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన ఇడ్లీ ప్రాముఖ్యాన్ని చాటడమే దీని ఉద్దేశం. 2015లో చెన్నైలో ఈ వేడుక ప్రారంభమైంది. ఆవిరితో ఉడికించడం వల్ల ఇడ్లీలో కొవ్వు తక్కువగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అందుకే డాక్టర్లు సైతం దీనిని ఉత్తమ ఆహారంగా సిఫార్సు చేస్తారు. సాంబార్, చట్నీతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్తారు.
News March 30, 2026
రాష్ట్రంలో ఘోరం.. ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు

AP: విశాఖ LVనగర్లో దారుణం జరిగింది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇటీవల అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలు మౌనిక(29)ను ఆదివారం రాత్రి ఫ్లాట్కు పిలిచాడు. తర్వాత ఇద్దరిమధ్య గొడవ జరగడంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అనంతరం PSలో లొంగిపోయాడు. అతడి సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 30, 2026
త్వరలో మరో 2,929 పోస్టుల భర్తీ: దామోదర

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 9,572 పోస్టులు భర్తీ చేశామని, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. త్వరలో వైద్య శాఖలో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని అసెంబ్లీలో చెప్పారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికీ వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రెండేళ్లలో 9.5 లక్షల మందికి ఉచిత వైద్యం అందించినట్లు వివరించారు.


