News July 7, 2025

ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై ఉమ్మడి గుంటూరులో ఆసక్తి

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 33,063 మంది హాజరైన వారిలో 23,536 మంది అర్హత సాధించారు. జిల్లాలోని రెండు ప్రభుత్వ యూనివర్సిటీలు (ANUతోపాటు JNTU నరసరావుపేట) సహా 34 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 32,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆదివారం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌లు, 22న సీట్లు కేటాయించనున్నారు. అయితే అభ్యర్థుల కంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి.

Similar News

News July 7, 2025

VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

News July 7, 2025

బుట్టాయిగూడెం : ఐటీడీఏ పీవో‌కు వినతి ఇచ్చిన గిరిజన నేతలు

image

బుట్టాయిగూడెం మండలం కేఆర్ పురంలో ఐటీడీఏ పీఓ రాముల నాయక్‌ను టీ నర్సాపురం మండల బంజారా బజరంగీభేరి కమిటీ నాయకులు సోమవారం కలిశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ టీ నర్సాపురం మండలంలోని గిరిజన తండాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ఇస్లావత్ ప్రేమ్ చంద్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

News July 7, 2025

పెద్దపల్లి: ‘పీఎం కిసాన్ కోసం రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి’

image

రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆయా గ్రామాల రైతు వేదికల్లో కొనసాగుతుందని PDPL DAO ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే PM కిసాన్ నగదు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు. జులై చివరి వారంలో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ఈ లోగా రైతులు ఆయా గ్రామాల AEOలను సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.