News February 28, 2025

ఇంటర్మీడియట్ పరీక్షలకు వేళాయె..!

image

★ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
★ మహబూబ్ నగర్ జిల్లాలో 22483 మంది ఇంటర్ విద్యార్థులు
★ ప్రథమ సంవత్సరం:10922
★ ద్వితీయ సంవత్సరం:11561 మంది
★ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
★ పరీక్షల సందర్భంగా 144 సెక్షన్ అమలు
★ సిట్టింగ్ స్వ్కాడ్‌లు,ఫైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు
★ ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు
★ పరీక్ష సమయం: ఉ.9 నుంచి మ.12 వరకు
★ పరీక్షకు ఒక రోజు ముందే అన్ని సిద్ధం చేసుకోండి.

Similar News

News February 28, 2025

MBNR : రంజాన్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 28, 2025

MBNR: 36 పరీక్ష కేంద్రాలు, 22,483 మంది విద్యార్థులు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం పరీక్షలపై సమీక్షించిన కలెక్టర్, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయంతో పాటు తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2025

MBNR: పక్కడ్బందీగా ఇంటర్మీడియట్ పరీక్షలు: కలెక్టర్

image

మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలంటూ కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!