News February 28, 2026

ఇంటర్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2682 మందికి 67 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2575 మందికి 124 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5257 మంది విద్యార్థులకు 5066 మంది హాజరు కాగా 191 మంది గైర్హాజర్ అయినట్లు తెలిపారు.

Similar News

News February 28, 2026

నల్గొండ: నేడే ఆఖరు.. 2.42 లక్షల మంది పెండింగ్

image

జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు అందాలంటే తప్పనిసరిగా చేసుకోవాల్సిన ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ గడువు నేటితో ముగియనుంది. జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు కేవలం 55.06 శాతం మంది రైతులు మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,39,619 మంది రైతులు ఉండగా, ఇంకా 2,42,492 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మునుగోడు మండలంలో మాత్రమే అత్యధికంగా (70.22%) నమోదైంది.

News February 28, 2026

సెకండ్ ఇయర్ ఇంగ్లిష్ ఎగ్జామ్‌కు 365 మంది గైర్హాజరు

image

ఇంటర్ పరీక్షల్లో భాగంగా శనివారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. 18,465 మంది విద్యార్థులకు గాను 18,098 మంది విద్యార్థులు హాజరయ్యారు. 367 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News February 28, 2026

విజయనగరం జిల్లాను ఉద్యాన వనంగా తీర్చి దిద్దుతాం: సీఎం

image

విజయనగరం జిల్లాలో వచ్చే రెండేళ్లలో పండ్ల తోటల పెంపకానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో ఇది కార్యరూపం దాలుస్తుందన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కజొన్న వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఇకపై భవిష్యత్తులో పండ్లతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచించారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు.