News February 25, 2025

ఇంటర్ పరీక్షలుసజావుగా నిర్వహించాలి- కలెక్టర్

image

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Similar News

News February 25, 2025

విద్యార్థుల కోసం చివరి క్షణాల్లోనూ..!

image

ఉపాధ్యాయులకు విద్యార్థులే జీవితం. వారి భవిష్యత్తు కోసం చదువు చెప్తూ, ఒక్కోసారి దండిస్తూ తన జీవితాన్నే త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు చనిపోయే కొన్ని క్షణాల ముందు విద్యార్థుల కోసం ఆస్పత్రి బెడ్‌పై ల్యాప్‌టాప్‌ పట్టుకొని పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఉపాధ్యాయుడి కుమార్తె షేర్ చేయగా వైరలవుతోంది. విద్యార్థుల చదువు పట్ల అతని అంకితభావాన్ని అభినందించాల్సిందే.

News February 25, 2025

వనపర్తికి CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

వనపర్తిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాలను ఆయన పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

News February 25, 2025

నెల్లూరు: ఈ బాల్యం బడి బాట పట్టేనా..?

image

బడి ఈడు గల పిల్లలందరూ బడిలో ఉండాలి, బాల కార్మిక వ్యవస్థ వద్దు, బడిబాట పట్టాల్సిన చిన్నారులు, పని బాట పట్టకూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదని పలువురు విమర్శిస్తున్నారు. దుత్తలూరు మండలంలో పలువురు చిన్నారులు చెత్త కాగితాలు ఏరుకుంటూ, మరికొందరు బట్టీల వద్ద, క్రషర్ల వద్ద తమ బాల్యాన్ని ధారపోస్తున్నారు. వీరిని బడిబాట పట్టించాలని పలువురు కోరుతున్నారు.

error: Content is protected !!