News February 24, 2026
ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనగామ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 24, 2026
చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.
News February 24, 2026
సిద్దిపేట: టెన్త్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 82 కేంద్రాల్లో మొత్తం 15,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిఘా ఉంచాలన్నారు.
News February 24, 2026
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే చర్యలు!

ఇంటర్మీడియట్ పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో 17,762 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,224 మంది కలిపి మొత్తం 35,986 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని సూచించారు.


