News February 2, 2025
ఇంటర్ ప్రాక్టికల్స్ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
సదాశివనగర్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన కలెక్టర్

సదాశివనగర్ మండలం తీర్మన్పల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్.. విద్యార్థుల చదవడం, రాయడం, ఇంగ్లిష్, గణితం వంటి అభ్యాస సామర్థ్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులను అభినందించి, వారికి నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
News February 18, 2026
పార్వతీపురం: ‘సీఎస్సీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

పార్వతీపురం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎస్సీల నిర్మాణాలపై సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు.
News February 18, 2026
కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

<


