News February 2, 2025

ఇంటర్ ప్రాక్టికల్స్‌ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

image

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

CM కలిసిన కొండారెడ్డిపల్లి సర్పంచ్‌

image

కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటయ్య గురువారం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధికి బాటలు వేసినందుకు సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, గ్రామ నాయకులు కూడా ఉన్నారు.

News December 25, 2025

మహబూబాబాద్‌కు కేటీఆర్‌.. ఎప్పుడంటే

image

ఈనెల 27న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచుల ‘అభినందన సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కొత్త సర్పంచులను కేటీఆర్‌ సన్మానిస్తారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె కోరారు.

News December 25, 2025

భవిష్యత్‌లో సిరులు కురిపించనున్న కాపర్!

image

రానున్న రోజుల్లో కాపర్ (రాగి) ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న టన్ను కాపర్ ధర $12వేలు దాటింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్ నిర్మాణాలకు ఇవి ఎంతో కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2030 నాటికి కాపర్ డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండిలాగే కాపర్‌పైనా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.