News February 8, 2026

ఇంటర్ ప్రాక్టికల్స్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగుస్తాయని RIO యోహాన్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 56 కేంద్రాల్లో థియరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఉదయం 8:30 గంటలకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. శనివారం జరిగిన ప్రాక్టికల్స్‌కు 4,363 మంది హాజరవ్వగా, 169 మంది గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.

Similar News

News February 8, 2026

వంటింటి చిట్కాలు

image

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్‌ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.

News February 8, 2026

బీజేపీ అంటే గుణ వంతుల పార్టీ: బండి సంజయ్

image

BJP గుణవంతుల పార్టీ అని, ధనవంతుల పార్టీ కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చొప్పదండిలో ఇవాళ బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజాయితీగా పని చేయడం, ధర్మం కోసం నిలబడడమే BJPకి తెలుసన్నారు. ఈ మేరకు చొప్పదండిలో అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. దొంగ హామీలు ఇవ్వమని, అవినీతి చేయమని, అభివృద్ధి మాత్రమే చేస్తామన్నారు. గెలిచిన తర్వాత అమ్ముడుపోమని, ప్రలోబాలకు లొంగి పార్టీ మారమని ప్రమాణం చేయించారు.

News February 8, 2026

బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

image

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.