News April 12, 2025
ఇంటర్ ఫలితాలు.. పార్వతీపురం జిల్లా స్టేట్ ఫస్ట్

ఇంటర్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్ 70% ఉత్తీర్ణత సాధిస్తే, సెకండ్ ఇయర్ 81% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామని ఇంటర్ విద్యాధికారిని మంజుల వీణ తెలిపారు.
Similar News
News December 30, 2025
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టోల్ ఫ్రీ?

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఊరట కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైవేలపై వెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు టాక్. దీనికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, విజయవాడ మార్గాల్లో వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది.
News December 30, 2025
పశువుల మేతగా అజొల్లా.. ఇన్ని లాభాలా?

అజొల్లాలో అధికంగా మాంసకృత్తులు, తక్కువగా లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు వీటిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. 2kgల అజొల్లా ఒక కిలో దాణాతో సమానం. 2kgల అజొల్లాను రోజూ దాణాతో కలిపి పశువులకు పెడితే వాటి ఆరోగ్యం బాగుండి, పాల ఉత్పత్తి 15-20 శాతం వరకు పెరుగుతుంది. అజొల్లాలో ఉండే అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి12, బీటా కెరోటిన్లు, కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం పోషకాలు పశువులకు మేలు చేస్తాయి.
News December 30, 2025
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు పఠించాల్సిన మంత్రాలు, పలకాల్సిన నామాలు

* శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం
* ఓం విష్ణవే నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః.


