News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.
Similar News
News April 14, 2025
చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
News April 13, 2025
చిత్తూరు: ఏడాదిలో ఒక కోటి లక్ష రూపాయాల జరిమానా

ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనచోదకులకు కోటి లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 1,01,52,500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
News April 13, 2025
పులిచెర్ల: బావిలో దిగి బాలుడి మృతి

బంతి కోసం బావిలోకి దిగి పైకి రాలేక దిలీప్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పులిచెర్ల మండలం అయ్యవారిపల్లిలో చోటుచేసుకుంది. సురేష్, లత కుమారుడైన దిలీప్ బెంగళూరులో ఉంటున్నారు. ఉగాది పండుగకు అయ్యావారిపల్లికి వచ్చారు. శనివారం సాయంత్రం అవ్వతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. బంతి ఆడుకుంటున్న సమయంలో బంతి బావిలో పడింది. బంతి కోసం దిగిన దిలీప్ పైకి రాలేక మృతి చెందాడు. కల్లూరు ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు.