News April 12, 2024
ఇంటర్ ఫలితాల్లో కర్నూల్, నంద్యాల జిల్లా స్థానాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కర్నూల్ జిల్లా 68% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో, నంద్యాల 59% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 19818 మందికి 13394 మంది.. నంద్యాలలో 12022 మందికి 7102 మంది పాసయ్యారు. సెకండియర్లో కర్నూల్ 76% ఉత్తీర్ణతతో 12వ స్థానం, నంద్యాల జిల్లా 70% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 17294 మందికి 13210 మంది, నంద్యాలలో 9165 మందికి 6429 మంది పాసయ్యారు.
Similar News
News April 1, 2026
సైనైడ్ వాడకాన్ని నిషేధించండి: బీజేపీ

తుగ్గలి మండలం జొన్నగిరి, బొల్లవాని పల్లె, పగిడిరాయి గ్రామాలలో బంగారు వెలికితీతకు ఉపయోగిస్తున్న సైనైడ్ వాడకాన్ని నిషేధించాలని బీజెపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, హేమ సుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముడి బంగారం శుద్ధి చేయడానికి ప్రాణాంతకమైన రసాయన పదార్థాలు వాడటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రులు టీజీ భరత్, రామానాయుడుకు వినతిపత్రం అందజేశారు.
News April 1, 2026
రాయలసీమ యూనివర్సిటీకి NAAC లక్ష్యం: వీసీ

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.
News April 1, 2026
రాయలసీమ యూనివర్సిటీకి NAAC లక్ష్యం: వీసీ

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ NAAC అక్రిడిటేషన్ సాధించాల్సిన అవసరం ఉందని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు పేర్కొన్నారు. IQAC ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమీక్షలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని క్రమపద్ధతిలో సేకరించి ఆధారాలతో అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధ్యమేనని వీసీ అభిప్రాయపడ్డారు.


