News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ అద్భుత విజయం

ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారని అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. MECలో లిఖిత, గీతిక, హరిణి 494/500 మార్కులు సాధించారు. 490కి పైగా 88 మంది, 480 ఆపైన 498 మంది, 649 మందికి 475 ఆపైన మార్కులు వచ్చాయి. సీనియర్ ఇంటర్లో సాత్విక 982 మార్కులు, 970 ఆపైన 71 మంది, 141 మంది 960 ఆపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
Similar News
News April 15, 2025
అమరావతి నిర్మాణం కోసం 44,676 ఎకరాల భూ సేకరణ

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మరోసారి భారీ భూసేకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల నుంచి మొత్తం 44,676.647 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనున్నట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలంలో 16,407 ఎకరాలు, అమరావతి 7,306 ఎకరాలు, తాడికొండ 16,469ఎకరాలు, మంగళగిరి మండలంలో 4,492ఎకరాలు సేకరించనున్నట్లు సమాచారం. దీనిపై మీ COMMENT.
News April 15, 2025
తెనాలి: కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి యత్నం

గుంటూరు (D) తెనాలి మండలం గుడివాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. SI ఆనంద్ తెలిపిన వివరాల మేరకు.. 40 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం వివాహమై, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఆదివారం తెల్లవారు జామున ఓ కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. గమనించిన భార్య వెంటనే కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, BNS చట్టం కింద కేసులు నమోదు చేశారు.
News April 15, 2025
నేడు గుంటూరులో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెరిఫికేషన్

గుంటూరు జిల్లా మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రక్రియ మంగళవారం జరగనుంది. హైకోర్టు కామన్ ఉత్తర్వుల మేరకు అర్హులైన SGT, భాషా పండిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉదయం 11 గంటలకు డీఈవో కార్యాలయంలో జరుగుతుందని డీఈవో రేణుక వెల్లడించారు. 10-10-2017 తేదీ కామన్ సీనియారిటీ జాబితాలో పేర్లున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.