News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్లో గుంటూరు జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో 76% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం విశేషం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
Similar News
News September 10, 2025
గుంటూరు సంయుక్త కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News September 10, 2025
13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News September 10, 2025
రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు