News December 28, 2025
ఇంటింటి సర్వే ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

సచివాలయ సిబ్బందిని నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సిబ్బందితో కలిసి కలెక్టర్ హిమాన్సు శుక్ల శనివారం పరిశీలించారు. మేక్లిన్స్ రోడ్డులో నివాసాలకు వెళ్లి సర్వే చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాల్లో చిన్న బజార్, దోర్నాల వారి వీధి, టెంకాయల వీధిలోని సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ సర్వే, సిబ్బంది విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు: కన్నీరు ఇంకి.. గుండెలు తడారి

భర్తను కోల్పోయిన భార్య.. కొడుకు దూరమై తల్లి, తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని అర్థం కాని అభం శుభం తెలియని చిన్నారులు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం భవిష్యత్తు అంధకారమైంది. కన్నీళ్లు ఇంకిపోయిన వారి దీనస్థితి వర్ణణాతీతం. బిడ్డల్ని ఎలా సాకాలో అర్థం కాక ఆ తల్లి మూగగా రోదిస్తోంది. అనారోగ్యంతో సైదాపురంలో ఇవాళ మృతి చెందిన నాగారాజు ఇంట్లో కనిపించిన ఈ విషాద దృశ్యం గుండెల్ని మెలిపెట్టక మానదు.
News January 1, 2026
నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.
News January 1, 2026
నెల్లూరోళ్లు ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా..?

నెల్లూరు జిల్లాలో 2025 ఏడాదిలో చోరీకి గురైన ఫోన్ల ఖరీదు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ప్రజలు 1140 మొబైల్స్ పోగొట్టుకున్నారు. వీటి విలువ రూ.2.28కోట్లు అని అధికారులు వెల్లడించారు. మన పోలీసులు ఈ ఏడాదిలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో కాస్త ఆదమరిచినా మీ జేబులోని ఫోన్ పోవడం ఖాయం.


