News March 22, 2024
ఇంటి వద్దే ఓటుహక్కు వినియోగానికి దరఖాస్తుల స్వీకరణ

నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.
Similar News
News September 7, 2025
రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
News September 7, 2025
NLG: మాతృ సంస్థలోకి మళ్లీ..!

వీఆర్ఏలు, వీఆర్వోలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామ పాలనాధికారులుగా కొత్తగా నియమించింది. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీవోలుగా ఎంపిక చేసింది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఏలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
News September 7, 2025
NLG: జిల్లా నుంచి 85 మంది ఎంపిక

నల్గొండలోని ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాల్లో నిర్వహించిన ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ (19 విభాగాల్లో) 135 మంది వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనగా 85 మంది రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎండీ. అక్బర్అలీ తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ లో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.