News December 21, 2025
ఇంట్లో ధనం నిలవడం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలు

సంపద నిలవాలంటే ఇంట్లో శక్తి ప్రవాహం సరిగ్గా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ‘ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండొద్దు. శుభ్రంగా ఉంటేనే సానుకూలత పెరుగుతుంది. నీటి వృథా ధన నష్టానికి సంకేతం. లీకేజీలను అరికట్టాలి. పని ప్రదేశం అస్తవ్యస్తంగా ఉండొద్దు. వాయువ్యంలో శుభ్రం ముఖ్యం. ఇంట్లో అనవసరమైనవి ఉంచకూడదు. ఇల్లు పద్ధతిగా ఉంటేనే ఆర్థిక స్థితి బాగుంటుంది’అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
Similar News
News December 25, 2025
ఓ వెబ్ సిరీస్.. 8 వేల ఉద్యోగాలు, $1.4 బిలియన్లు!

పేరుకు తగ్గట్టే ‘Stranger Things’ సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే 2016 నుంచి ఇప్పటిదాకా $1.4B మేర అమెరికా GDPకి దోహదపడింది. 8 వేల జాబ్స్ కల్పించింది. ఆ సిరీస్లో చూపిన ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తడంతో టూరిజం ఆదాయం భారీగా వచ్చింది. అందులో కనిపించిన ఫుడ్ ఐటమ్స్, బొమ్మలు, వీడియో గేమ్స్, పాటలకూ డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ 120 కోట్ల <<18400629>>వ్యూస్<<>> సాధించింది.
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎవరికి ఉంటుందంటే..

40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం కూడా మొదలవుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, మృదువుగా మారడం ప్రారంభిస్తాయి. చాలామంది మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య ఈ వయసులోనే మొదలవుతుంది. సరైన జీవనశైలి లేని స్త్రీలు బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


