News November 19, 2025
ఇండియా ఘన విజయం

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ జట్టు రెండో విజయం సాధించింది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135-7 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఓపెనర్లు వైభవ్(12), ప్రియాన్ష్ ఆర్య(10) నిరాశపరిచినా, హర్ష్ దూబే(53*), నమన్ ధిర్(30) రాణించారు. దీంతో ఇండియా-ఏ సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
Similar News
News March 11, 2026
‘హార్ముజ్’ దాటాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే: ఇరాన్

ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇండియాకు వెళ్తున్న థాయిలాండ్ <<19355576>>కార్గో షిప్పై దాడి<<>> చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ‘హార్ముజ్ గుండా ఒక్క లీటర్ ఆయిల్ను కూడా వెళ్లనివ్వం. ఈ జలసంధి నుంచి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. ముడి చమురు బ్యారెల్ రేట్ 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.
News March 11, 2026
గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT
News March 11, 2026
ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.


