News February 26, 2025

ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు 

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు.  సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.

Similar News

News February 28, 2026

సిద్దిపేట: హై కోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్

image

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పుల్ల కార్తీక్ శనివారం సిద్దిపేట పర్యటనకు విచ్చేశారు. హరిత మినర్వా హోటల్‌లో కలెక్టర్ కె.హైమావతి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లా కోర్టులో న్యాయశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి న్యాయపరమైన అంశాలపై నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జడ్జి పాల్గొన్నారు.

News February 28, 2026

ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిట్టింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 28, 2026

NRPT: మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ

image

మీసేవ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మొబైల్ యాప్‌ను విధిగా వినియోగించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాప్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.