News April 17, 2025

ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు పాటించాలి: అదనపు కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News April 19, 2025

ఎన్టీఆర్: నాలుగు మండలాల్లో ఆరంజ్ అలర్ట్

image

ఎన్టీఆర్ జిల్లాలోని 4 మండలాల్లో శనివారం అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ఆర్.కూర్మనాథ్ హెచ్చరిస్తూ ‘X’ పోస్ట్ చేశారు. నేడు చందర్లపాడు 44.7, జి.కొండూరు 44.2, విజయవాడ అర్బన్ 43.9, రూరల్‌లో 43.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అవుతుందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

News April 19, 2025

వనపర్తిలో డిగ్రీ విద్యార్థిని MISSING

image

అలంపూర్‌కి చెందిన డిగ్రీ విద్యార్థిని వనపర్తి పట్టణంలో అదృశ్యమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అలంపూర్ క్యాతూర్‌ వాసి దాసరి బిందు వనపర్తిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. ఈనెల 16 నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వనపర్తిలోని బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 19, 2025

GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.

error: Content is protected !!