News September 3, 2025

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రజాభవన్‌లో 87 మంది వినతి

image

ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ పలు ప్రాంతాలకు చెందిన వారు ప్రజాభవన్‌లో వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో 243 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అత్యధికంగా 87 మంది ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 33, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 57, మిగతా సమస్యలపై 66 మంది వినతిపత్రాలు ఇచ్చారని ప్రజావాణి ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు.

Similar News

News September 7, 2025

HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

image

ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.

News September 7, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News September 7, 2025

HYD: మైనర్‌ బాలికపై అత్యాచారం

image

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.