News December 30, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 12వ స్థానంలో వనపర్తి

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వనపర్తి జిల్లా 12వ స్థానంలో నిలిచింది. జిల్లాకు 6,500 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 50 శాతం పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. అయితే, గతంలోనే బేస్మెంట్ వరకు నిర్మించుకున్న 1,308 మంది పేదలకు మొదటి విడతలో నిధులు మంజూరు కాలేదు. వీరి జాబితా ప్రభుత్వం వద్దే ఉందని, వెంటనే ఆ ఇళ్లను మంజూరు చేయాలని పానుగల్కు చెందిన లబ్ధిదారులు కోరుతున్నారు.
Similar News
News January 1, 2026
విజయవాడ మహిళకు అమెరికాలో అదనపు కట్నం వేధింపులు.!

విజయవాడలోని అంబాపురానికి చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లిలో ₹40 లక్షల నగదు, ₹25 లక్షల బంగారం ఇచ్చినా, అమెరికా వెళ్లాక కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేయడంతో ఒత్తిడికి లోనై శిశువును కోల్పోయినట్లు తెలిపింది. వేధింపులు తాళలేక స్వదేశానికి తిరిగి వచ్చి భర్త, కుటుంబంపై పోలీ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
News January 1, 2026
UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్రాజ్ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.
News January 1, 2026
తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.


