News May 14, 2024
ఇందిరా గాంధీ జూలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్

ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో మే 21 నుంచి సమ్మర్ క్యాంప్-2024 నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ డా.నందని సలారియా తెలిపారు. 5 సంవత్సరాల వయస్సు నుంచి 18 సంవత్సరాల వయస్సు వరకు ఎవరైనా ఈ సమ్మర్ క్యాంప్లో పాల్గొనవచ్చు అన్నారు. 5 నుంచి 11 సంవత్సరాల వారికి మే 21 నుంచి 25 వరకు, 12-18 సంవత్సరాల వారికి మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు బ్యాచ్లుగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
14 గంటలు ఆలస్యంగా అగర్తలా హంసఫర్ రైలు

మొంథా తుపాన్ నేపథ్యంలో చాలా రైళ్లు రద్దు చేసినప్పటికీ సుమారు 8 రైళ్లు మాత్రం ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో బెంగళూరు నుంచి బయలుదేరే అగర్తలా హంసఫర్ (12503) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సుమారు 14 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు విశాఖకు బుధవారం ఉదయం నాలుగు గంటల 10 నిమిషాలకు రావాల్సి ఉంది. అయితే సుమారు రాత్రి 7 గంటలకు చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
News October 29, 2025
జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News October 29, 2025
జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలను కమిషనర్ కేతన్ గార్గ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నామని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.


