News October 5, 2025
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవాని భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ దర్శనానికి ఆదివారం భవాని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఆలయ ఈవో శీనా నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు సజావుగా పూజల్లో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా పూర్తి చేశామని, అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఈవో తెలిపారు.
Similar News
News October 5, 2025
రజినీ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన నిల్చొని భోజనం!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హిమాలయాల సందర్శనకు వెళ్లారు. ‘జైలర్-2’ షూటింగ్కు వారం రోజులు తాత్కాలికంగా విరామం ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రిషికేశ్లోని ఒక ఆశ్రమంలో సేద తీరుతున్నారు. అక్కడ రోడ్డు పక్కనే సాధారణ వ్యక్తిలా భోజనం చేస్తున్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. రజినీ ఇప్పటికే బద్రీనాథ్ ఆలయం, బాబా గుహ వంటి పలు పవిత్ర స్థలాలను సందర్శించినట్లు తెలుస్తోంది.
News October 5, 2025
వరంగల్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
News October 5, 2025
కురుపాం గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవులు: కలెక్టర్

కురుపాం(M) శివన్నపేట గురుకుల బాలికల పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రేపటి నుంచి వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు మెరుగైన వైద్యం కోసం జాండీస్ లక్షణాలున్న విద్యార్థినిలను KGHకు తరలించారు. ప్రతి విద్యార్థి రక్తనమునాలను సేకరించామన్నారు. కాగా పలువురు విద్యార్థులు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.