News March 18, 2024

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. నిన్న, ఇవాళ కలిపి 2.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నూతన వధూవరులు, పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమైన పదో తరగతి విద్యార్థులతో పాటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. రెండ్రోజుల్లో రూ.17 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News September 3, 2025

పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

image

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్‌ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.

News September 2, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్‌లో ఆటో డ్రైవర్ల ఆందోళన

News September 2, 2025

హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

image

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.