News November 15, 2024
ఇంద్రవెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్.. జూనియర్ అసిస్టెంట్గా ఎంపిక

ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకి చెందిన శ్యామ్ రావ్, రేఖ బస్సి దంపతుల కుమార్తె ప్రీతి గ్రూప్ -4 ఫలితాల్లో కొలువు సాధించింది. ఇది వరకే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జాయిన్ అయింది. గ్రూప్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సెలవు పెట్టి ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఎట్టకేలకు గ్రూప్ -4 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైంది. దీంతో బంధుమిత్రులు అభినందించారు.
Similar News
News July 9, 2025
ADB: ఆగస్టు 3న టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ పరీక్ష

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) రాత పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు డీఈవో శ్రీనివాస్రెడ్డి బుధవారం తెలిపారు. మే, జూన్ 2025లో నిర్వహించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్స్లో ఫెయిలైన విద్యార్థుల కోసం హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఆగస్టు 3న పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News July 9, 2025
ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News July 8, 2025
ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.