News January 17, 2026

ఇంద్రవెల్లి: మర్రి చెట్ల చెంతకు చేరిన మెస్రం వంశీయులు

image

ఈనెల 18న నిర్వహించే నాగోబా మహా పూజకు అవసరమయ్యే పవిత్ర గంగాజలంతో తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు కేస్లాపూర్ పొలిమేరకు చేరుకున్న విషయం తెలిసిందే. మరి చెట్టు వద్దనే ఆదివారం వరకు గడపనున్నారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలను సిరికొండ వెళ్లి మెస్రం వంశీయులు తీసుకొని వచ్చి ఆలయ వెనుక భాగంలో భద్రపరిచారు. ఆదివారం రాత్రి పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి తెలిపారు.

Similar News

News February 5, 2026

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల

image

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం రూ.3,000 కోట్ల వరకు రావాల్సి ఉండగా తొలి విడతగా రూ.259 కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగతా నిధులనూ వెంటనే జమ చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం కావడంతో ఈ నిధులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

News February 5, 2026

‘ఇండిగో’పై విచారణకు CCI DG ఆదేశం

image

2025 DECలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) DG విచారణకు ఆదేశించారు. DGCA డేటా ఇన్‌పుట్‌లను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించడానికి ఇండిగో ఇలా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఆ సమయంలో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 నెలల తరువాత ఇప్పుడు దర్యాప్తునకు ఆదేశించారు. ఇండిగో విధానాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

News February 5, 2026

HYD: మీరు గ్రేట్ సారూ.. ఉద్యోగం మానేసినా బదిలీ చేశారు!

image

జీహెచ్ఎంసీలో పలువురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే విచిత్రమేమంటే.. కొందరు ఉద్యోగాలు మానేసినా వారి పేరు బదిలీల్లో ఉండటం చర్చనీయాంశమైంది. శేరిలింగంపల్లిలో తాహేర్, అలేఖ్య, సుభాషిణిలు ఎప్పుడో జాబ్ మానేశారు. అయితే బదిలీల్లో వీరు పేరుంది. మరి జీతాలు కూడా వారి పేరిట డ్రా అవుతున్నాయేమో అని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.