News December 15, 2025

ఇంధన పొదుపే అభివృద్ధికి మూలం: కలెక్టర్ శ్యాం ప్రసాద్

image

భవిష్యత్ తరాలకు సుస్థిరమైన జీవన విధానం అందించాలంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును తమ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు

Similar News

News December 21, 2025

ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.

News December 21, 2025

ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

image

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.

News December 21, 2025

#SaveAravalli: పురాతన పర్వతాల కోసం నెటిజన్ల పోరాటం!

image

గుజరాత్, రాజస్థాన్, హరియాణాల్లో విస్తరించిన ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ సోషల్ మీడియాలో #SaveAravalli క్యాంపెయిన్ ఊపందుకుంది. 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే ‘ఆరావళి’గా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పడమే దీనికి కారణం. దీనివల్ల మైనింగ్, అక్రమ కట్టడాలు, ఎడారి ధూళి వల్ల ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రం కావడం, రాజస్థాన్‌లో వర్షాలు తగ్గడం వంటి దుష్పరిణామాలు ఉంటాయని పర్యావరణవేత్తల ఆందోళన.