News October 9, 2025

ఇకనైనా ANU ప్రతిష్ట మెరుగుపడుతుందా?

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పరిపాలనకు తెరపడింది. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ 24 స్థానాలు తగ్గడంతోపాటు, విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై Way2Newsలో సైతం పలు కథనాలు పరిచురించబడ్డాయ. ఈ పరిస్థితుల్లో నూతన వీసీ అకాడెమిక్ నాణ్యత, పేపర్ వాల్యుయేషన్, ఫలితాలలో పారదర్శకత, విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తే విశ్వవిద్యాలయ ప్రతిష్టను పునరుద్ధరించేందుకు అవకాశముంది.

Similar News

News October 9, 2025

ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ భేటీ

image

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో ఆయన ఉండవల్లిలో బుధవారం సమావేశమయ్యారు. టీచర్ల బదిలీలు, భాషా పండితుల పదోన్నతుల సమస్యలను పరిష్కరించినందుకు ఉపాధ్యాయులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు.

News October 9, 2025

గుంటూరు: గంజాయి కేసుల దర్యాప్తుపై అవగాహన

image

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తు వేగవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో
బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా శిక్షణా కేంద్రం (DTC), ఈగిల్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NDPS చట్టంలోని సీజ్, శాంప్లింగ్, డిస్పోజల్ వంటి అంశాలపై పోలీసు సిబ్బందికి సీసీఎస్ డీఎస్పీ మధుసూదన్ రావు అవగాహన కల్పించారు. DTC సీఐ ఈగల్ సీఐ ఉన్నారు.

News October 9, 2025

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా సమంతపూడి

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సమంతపుడి వెంకట సత్యనారాయణ రాజును నియమించారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కీటకాలజీ విభాగ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బుధవారం సమంతపూడి వెంకట సత్యనారాయణ రాజును కొత్త వైస్‌ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.