News December 31, 2025

ఇకపై అన్నీ మదనపల్లెలోనే..?

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె నేటి నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడి నుంచే పాలన కొనసాగనుంది. మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు. రాయచోటిలో నిన్న ఎస్పీ ధీరజ్ చివరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ గ్రీవెన్స్ ఇకపై మదనపల్లెలోనే జరిగే అవకాశం ఉందని చెప్పారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ సైతం ఇకపై మదనపల్లె నుంచే తన డ్యూటీ నిర్వహిస్తారు.

Similar News

News January 1, 2026

40’s తర్వాత నిద్ర తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా?

image

40 ఏళ్ల తర్వాత శరీరానికి 7-9 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 7గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతే టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుదలతోపాటు రోజువారీ కార్యకలాపాలకు బాడీ నెమ్మదిగా స్పందిస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ, ప్రీ డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలు వచ్చే ప్రమాదముంది.

News January 1, 2026

IASలతో CM రేవంత్ సెలబ్రేషన్స్

image

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో CM రేవంత్ పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం’ అని తెలిపారు.

News January 1, 2026

పండుగలా పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలి: జేసీ

image

జిల్లాలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని పండుగ వాతావరణంలో చేపట్టాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. జనవరి 2 నుంచి 9 వరకు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.