News August 26, 2025

ఇకపై ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందొచ్చు: కలెక్టర్

image

జిల్లాలో పెన్షన్ గ్రహీతలు ఇకపై బయోమెట్రిక్ సమస్యలు లేకుండా ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందవచ్చని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో పోస్టుమాస్టర్లకు ముఖ గుర్తింపు పరికరాలను అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కొత్త విధానం వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ సాంకేతికతతో పెన్షన్ చెల్లింపులో పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలిపారు.

Similar News

News August 26, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ కొత్తగూడెం, BHPL, మహబూబాబాద్, ములుగు, WGLలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, HNK, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, MNCL, మేడ్చల్, NLG, నిర్మల్, PDPL, సిరిసిల్ల, రంగారెడ్డి, SDPT, సూర్యాపేట, యాదాద్రిలో పిడుగులతో వానలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 26, 2025

సిద్దిపేట: యూరియా పక్కదారి పట్టిందా..?

image

యూరియాకు భారీ డిమాండ్ ఉండడంతో జిల్లాలో పక్కదారి పట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూలో రోజుల తరబడి ఎదురుచూసిన యూరియా రైతులకు అందడం లేదు. ఇక్కడికి రావాల్సిన నిల్వలు దారిమలిస్తున్నారా లేక కోటానే తగ్గించారా అనే విషయం తెలాల్సి ఉంది. ఈ నెలలో 13,090 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా 2,920 టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. యూరియా సరఫరా పై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

News August 26, 2025

అర్జీదారులతో మర్యాదగా మెలగాలి: కలెక్టర్

image

అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం అనంతరం కలెక్టర్, అధికారులతో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.