News January 9, 2025
ఇచ్ఛాపురం: ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6 నుంచి 341 రోజుల పాటు సాగింది. 2019 జనవరి 9లో ముగిసింది. ఈ పాదయాత్ర 2019 ఏపీ శాసనసభ ఎన్నికల ముందు ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపునకు గుర్తుగా వైసీపీ శ్రేణులు ఒక స్తూపం నిర్మించారు. గురువారం ఇచ్ఛాపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్తూపం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
Similar News
News November 6, 2025
ఏపీలో కొత్తగా 2 జిల్లాలు..మరి పలాస..?

APలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం 2 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో పలాసను జిల్లాగా మార్చాలన్నా ప్రతిపాదనను పాలకులు పట్టించుకోలేదు. పునర్విభజనను కూటమి మళ్లీ తెరపైకి తేగా..నిన్న జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో ప్రస్తావించకపోవడం ఉద్దానం వాసుల ఆశలను నీరుగార్చారు. మరో 2 రోజుల్లో రానున్న నివేదికలోనైనా తమ ప్రాంతం పేరు రావాలని ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.
News November 6, 2025
SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.
News November 5, 2025
SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్కు వివరించారు.


