News February 12, 2025
ఇజ్రాయెల్ రాయబారిని కలిసిన బాపట్ల MP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337900212_50050387-normal-WIFI.webp)
భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీరువాన్ అజార్ని బుధవారం బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల పార్లమెంటరి నియోజకవర్గం గురించి ఎంపీ వివరించారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, జల వనరులు, వ్యాపార అవకాశాలు తదితర అంశాలు గురించి అజార్తో ఎంపీ చర్చించారు.
Similar News
News February 12, 2025
సంగారెడ్డి: త్వరలో హరీశ్ రావు పాదయాత్ర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344477387_50001075-normal-WIFI.webp)
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు భూసేకరణ దశలో నిలిచిపోయాయని, తిరిగి పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపడతామన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో హరీశ్ రావు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.
News February 12, 2025
HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739341418796_52296546-normal-WIFI.webp)
కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.
News February 12, 2025
వాట్సాప్ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345690722_20522720-normal-WIFI.webp)
సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.