News November 20, 2025

ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

image

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News April 14, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

ఎన్నికలు ముగిశాక పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం: Macquarie

image

క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని Macquarie అనే గ్రూప్ తెలిపింది. బ్యారెల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ చివర్లో తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 14, 2026

ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

image

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.