News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83

ఈరోజు ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
Similar News
News March 5, 2026
గ్యాస్, ఆయిల్ కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

ఇంధన భద్రత విషయంలో ఇండియా కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అవసరమైనంత మేర నిల్వలున్నాయి. రోజూ స్టాక్ నింపుతున్నాం. LPG/LNG కొరత లేదు. ప్రపంచంలో ముడి చమురుకు షార్టేజ్ లేదు. క్రూడ్, గ్యాస్ కొనుగోలు కోసం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, IEA, OPECతో చర్చిస్తున్నాం. గ్యాస్ సరఫరాకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. UAE, USతో ఒప్పందం చేసుకున్నాం’ అని వెల్లడించాయి.
News March 5, 2026
జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: స్పీకర్

AP: మాజీ సీఎం జగన్ మినహా YCP MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం జరగదని తేల్చిచెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరైనా పరిగణనలోకి రాదు. వరుసగా 65 రోజులు గైర్హాజరైతే నోటీసులిస్తాం. ఈ విషయంపై లోక్సభ స్పీకర్ను సంప్రదిస్తా. సభకు రాని MLAలపై చర్యలు తీసుకునే చట్టాలను పార్లమెంటులోనే చేయాలి’ అని పేర్కొన్నారు.
News March 5, 2026
డ్యూటీ ముగిసిందని వెళ్లిపోయిన లోకో పైలట్.. 3 గంటలు చుక్కలు!

తన పని గంటలు ముగిశాయంటూ ట్రైన్ను ప్లాట్ఫామ్పై నిలిపేశారో లోకో పైలట్. దీంతో వందలాది ప్రయాణికులు 3 గంటలపాటు ఇక్కట్లు పడ్డారు. బిహార్లోని కిషన్ గంజ్(D) ఠాకూర్గంజ్ రైల్వే స్టేషన్లో జరిగిందీ ఘటన. మాల్డా-సిలిగురి రైలు నిన్న మధ్యాహ్నం ఠాకూర్గంజ్ చేరుకుంది. రూల్ ప్రకారం తన 9 గం. షిఫ్ట్ అయిపోయిందని అధికారులకు చెప్పి, రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారని సమాచారం.


