News March 18, 2024

ఇది యూకేజీ ఫీజా.. ఆస్తులు అమ్మాల్సిందే!

image

పిల్లల్ని కిండర్‌గార్టెన్(కేజీ) చదివించాలంటే సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండొచ్చు. అంతేకదా..? కానీ ఓ పాఠశాలలో మాత్రం అక్షరాలా రూ.2,72,718 కట్టాల్సి ఉంటుంది. అందులో రూ.33వేలు తర్వాత రిఫండ్ ఇస్తారట. దీనికి సంబంధించి ఓ ఫొటో వైరల్ అవుతోంది. ‘ఇది యూకేజీ ఫీజా..? పిల్లల్ని ఇలా చదివించాలంటే మా ఆస్తులు అమ్మాల్సిందే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News August 27, 2025

అర్హులెవరికీ అన్యాయం జరగదు: చంద్రబాబు

image

AP: అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పార్టీ యంత్రాంగానికి CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రూ.500ల దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ప్రజలకు ఎంతో చేస్తున్నాం. చేసింది చెప్పుకుందాం. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News August 27, 2025

వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ డెవలప్‌మెంట్: CM రేవంత్

image

TG: HYD నగరానికి వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి జరగాలని అధికారులకు CM రేవంత్ చెప్పారు. గేట్ వే ఆఫ్ HYD, గాంధీ సరోవర్, జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలని, పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మీరాలం చెరువు, ఐకానిక్ బ్రిడ్జ్ ప్రాజెక్టుల DPR సిద్ధం చేసి పనులు మొదలెట్టాలని ఆదేశించారు.

News August 27, 2025

వీధి వ్యాపారులకు లోన్లు.. కేంద్రం గుడ్ న్యూస్!

image

PM స్వనిధి పథకం గడువును కేంద్రం 2030 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో ₹15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో ₹25 వేలు, మూడో విడతలో ₹50,000 మంజూరు చేస్తారు. ఇప్పటివరకు తొలి విడతలో ₹10K, రెండో విడతలో ₹20K ఇచ్చేవారు. తాజాగా ఆ మొత్తాన్ని పెంచారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో అప్లై చేయాలి.