News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో దారుణం..!

image

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో బీటె‌క్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరువు హత్య అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News September 7, 2025

HYD: నంది వాహనం ఎక్కిన ‘శివ’పుత్రుడు

image

వినాయక నిమజ్జనోత్సవంలో ‘శివ’పుత్రులు దర్శనమిచ్చారు. అవును.. హిమాయత్‌నగర్‌లో ఈ దృశ్యం భక్తులను కనువిందు చేసింది. శనివారం ట్యాంక్‌బండ్‌కు ఎడ్లబండి మీద ఓ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు. రథసారథిగా శివుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంది వాహనం ఎక్కి గణపయ్య వస్తున్నాడు అంటూ భక్తులు పరవశించిపోయారు. ఈ వినూత్న ఆలోచన బాగుంది కదూ.

News September 7, 2025

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల నిరసన

image

చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి స్పందించట్లేదని మండిపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్దత గల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 15 వేల పోస్టులతో మెగా DSC, 7,500 పోస్టులతో GPO నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్యాగాలు మావీ.. భోగాలు మీవా అంటూ నినాదాలు చేశారు.

News September 7, 2025

HYDలో PHOTO OF THE DAY

image

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనోత్సవం సాగర తీరాన జనసంద్రాన్ని తలపించింది. ఉదయం ఖైరతాబాద్ మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్రకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. సెక్రటేరియట్‌ వద్దకు విగ్రహం చేరుకోగా ఇసుకేస్తే రాలనంత జనం గుమిగూడారు. చుక్కల్లో చంద్రుడి వలే భారీ ఆకారంలో మహా గణపతి, ఆ పక్కనే సచివాలయం ఒకే ఫ్రేమ్‌లో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సిటీలో PHOTO OF THE DAYగా నిలిచింది.