News February 22, 2025

ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

image

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.

Similar News

News November 5, 2025

మెదక్‌లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

image

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News November 5, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
> జనగామ, సిద్దిపేట హైవేపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాస్తారోకో
> చీటకోడూరు బ్రిడ్జి వద్ద బీజేపీ నేతల నిరసన
> జిల్లా వ్యాప్తంగా నల్ల నరసింహులు వర్ధంతి
> పాలకుర్తిలో వెలిగిన అఖండ జ్యోతి
> గాడిదలు, దున్నపోతులతో నిరసన తెలుపుతాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> జనగామ: బిక్షాటనతో ఎస్ఎఫ్ఐ నేతల నిరసన
> బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే యశస్విని

News November 5, 2025

‘మీ డబ్బు- మీ హక్కు’ గోడ పత్రిక ఆవిష్కరణ

image

పది ఏళ్లు అంతకు మించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మీ డబ్బు- మీ హక్కు నినాదంతో భారత ప్రభుత్వం మూడు నెలల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంపై రూపొందించిన గోడ పత్రికను బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఆయన ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో 5,88,521 బ్యాంకు ఖాతాల్లో రూ.101.22 కోట్లు సొమ్మును తిరిగి పొందవచ్చన్నారు.