News March 20, 2024
ఇబ్రహీంపట్నం: మాజీ భర్తపై యాసిడ్తో దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710851420122-normal-WIFI.webp)
మాజీ భర్తపై యాసిడ్ దాడి జరిగిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో జరిగింది. ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహేశ్కు, మెట్పల్లికి మండలానికి చెందిన మాస లక్షణతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరు 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మహేశ్ మరో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మంగళవారం లక్షణ, మహేశ్ ఇంటికెళ్లి అతనిపై యాసిడ్ దాడి చేసింది. దీంతో మహేశ్కు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News July 5, 2024
KNR: నిరుపయోగంగా మారుతున్న రైతువేదికలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720171145997-normal-WIFI.webp)
రైతులకు ఆధునిక ,సాంకేతిక సమాచారాన్ని అందించేందుకు ఒక వేదికను నిర్మించాలని గత ప్రభుత్వం రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది. ఆరేళ్ల క్రితం అట్టహాసంగా రైతువేదికల నిర్మాణం చేపట్టగా అసంపూర్తి పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ మండలంలో దుర్శేడు, బొమ్మకల్, నగునూర్, చామనపల్లిలో నిర్మించిన రైతువేదిక భవనాల్లో సౌకర్యాలు లేక, అసంపూర్తిగా నిర్మాణాలు చేయగా, ఇవి నిరుపయోగంగా మారుతున్నాయి.
News July 5, 2024
కరీంనగర్: జలపాతం వద్ద తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720158166744-normal-WIFI.webp)
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్కు చెందిన సంపత్, మన్నెంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గురువారం జలపాతాన్ని చూసేందుకు వెళ్లగా.. తేనెటీగలు దాడి చేశాయన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పృహ తప్పి పడిపోయారు. వారికి గాయాలు కావడంతో గ్రామస్థులు 108 ద్వారా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News July 5, 2024
జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720152563053-normal-WIFI.webp)
జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.